News March 14, 2025

ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

image

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.

Similar News

News March 14, 2025

ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ మరాఠీలోనే: ఫడణవీస్

image

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC) పరీక్షలన్నింటినీ మరాఠీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర CM ఫడణవీస్ ప్రకటించారు. ‘ఇంజినీరింగ్ కోర్సులు సహా అన్ని సాంకేతిక సబ్జెక్టులూ మరాఠీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. MPSC పరీక్షల మరాఠీ నిర్వహణ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనమండలిలో తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడలేని విద్యార్థుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 14, 2025

పర పురుషులతో భార్య సెక్స్‌చాట్‌ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

image

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.

News March 14, 2025

అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

image

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.

error: Content is protected !!