News March 11, 2025
పాకిస్థాన్లో రైలు హైజాక్.. బందీలుగా 450మంది!

పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసింది. అందులోని ఆరుగురు సైనికుల్ని చంపింది. 350మందికి పైగా ప్రయాణికుల్ని, 100మంది సైనికుల్ని బందీలుగా తీసుకుంది. ‘మా పోరాటవీరులు రైల్వే పట్టాల్ని పేల్చేసి రైలును హైజాక్ చేశారు. మాపై ఏమైనా సైనిక చర్యలకు ఉపక్రమిస్తే అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంది, అందర్నీ చంపేస్తాం’ అని హెచ్చరించింది. తమ డిమాండ్లు ఏంటన్నది ఇంకా చెప్పలేదు.
Similar News
News January 29, 2026
పెళ్లికాని వ్యక్తి మహిళలతో రిలేషన్లో ఉంటే తప్పేంటి: కేరళ HC

పెళ్లైన మహిళ సమ్మతితో రిలేషన్లో ఉండడం చట్టబద్ధమైనప్పుడు, పెళ్లి కాని వ్యక్తి ఇద్దరు/ముగ్గురు మహిళలతో సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటని కేరళ HC ప్రశ్నించింది. దాని కారణంగా కేరళ MLA రాహుల్ మాంకూటతిల్కు బెయిల్ తిరస్కరించడం ఎలా సాధ్యమని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ప్రశ్నించారు. MLAకు వ్యతిరేకంగా పలువురు మహిళలు చేస్తున్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జనరల్ వాదనలు విన్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
News January 29, 2026
ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ కీలక సమావేశం

TG: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్ రానున్నారు. 2న మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరగనుంది.
News January 29, 2026
ఈ సంకేతాలు ఉంటే కిడ్నీ సమస్యలు!

* ఎక్కువ/తక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం.
* ముఖం, పాదాల్లో వాపులు.
* నురుగు/గోధుమ రంగు/రక్తంతో మూత్రం రావడం.
* త్వరగా అలసిపోయినట్టు/అలసటగా అనిపించడం.
* కండరాల తిమ్మిర్లు.
* చర్మం పొడిబారడం, దురద పెట్టడం.
* ఊపిరి సరిగ్గా అందకపోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


