News March 19, 2025

ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

image

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.

Similar News

News January 4, 2026

మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

image

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.

News January 4, 2026

అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

image

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్‌లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.

News January 4, 2026

NIAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) 5 సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. LLB అర్హతతో పాటు క్రిమినల్ కేసులు వాదించడంలో కనీసం 8 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nia.gov.in