News July 17, 2024

కలెక్టర్‌పై వేధింపుల కేసు పెట్టిన ట్రైనీ IAS

image

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పుణే కలెక్టర్‌ సుహాస్ దివాసేపై వేధింపుల కేసు పెట్టారు. తనను ట్రాన్స్‌ఫర్ చేసిన కలెక్టర్‌పైనే కేసు పెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఐఏఎస్ ప్రొబేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే ఆరోపణలతో ఆమె వార్తల్లోకి ఎక్కారు.

Similar News

News December 12, 2025

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు

News December 12, 2025

అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

image

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.

News December 12, 2025

రేవంత్-మెస్సీ మ్యాచ్‌కు రాహుల్ గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్‌లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్‌తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.