News March 21, 2024
లంచగొండిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.
Similar News
News September 13, 2025
ఇంటి ముందు గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలంటే?

ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టడానికి అమావాస్య రోజు అత్యంత అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. ఆరోజు సూర్యోదయానికి ముందే గుమ్మడికాయకు పసుపు, కుంకుమ పూసి వేలాడదీయడం ద్వారా నరదిష్టి, కనుదిష్టి తొలగిపోతాయని అంటున్నారు. బుధవారం, శనివారం రోజున కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చని సూచిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కట్టడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.
News September 13, 2025
పిల్లలు మట్టి తింటున్నారా?

పిల్లలు ఎదిగేటప్పుడు చేతికి అందిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు మట్టి, సుద్ద, బొగ్గులు తింటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐరన్ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లలు ఇలాంటి పదార్థాలు తింటారని వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
డిగ్రీ అర్హతతో 394 జాబ్స్.. ఒక్క రోజే ఛాన్స్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ(SEP 14). డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు <
#ShareIt