News September 7, 2024
త్వరలో గంటకి 250 కిమీ వేగంతో నడిచే రైళ్లు!

రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 250 KM వేగంతో నడిచే 2 రైళ్ల రూపకల్పన, తయారీకి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్లో 2 స్టాండర్డ్ గేజ్ రైళ్ల తయారీకి రైల్వే శాఖ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి లేఖ రాసింది. 8 కోచ్లు ఉండేలా ఉక్కుతో తయారై 220 KM రన్నింగ్ సామర్థ్యంతో గరిష్ఠంగా 250 KMPH వేగం కలిగి ఉండాలని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం వందే భారత్ 160 KMPH వేగంతో నడవగలవు.
Similar News
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.
News November 18, 2025
మోక్షాన్ని పొందడమే మన ధర్మం

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణమ్ ఈ సృష్టిలోని సకల ప్రాణులకూ చేరుకోవాల్సిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్య తత్వాన్ని ఆరాధించి, మోక్షాన్ని పొందడమే మన ధర్మం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


