News September 7, 2024
త్వరలో గంటకి 250 కిమీ వేగంతో నడిచే రైళ్లు!

రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 250 KM వేగంతో నడిచే 2 రైళ్ల రూపకల్పన, తయారీకి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్లో 2 స్టాండర్డ్ గేజ్ రైళ్ల తయారీకి రైల్వే శాఖ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి లేఖ రాసింది. 8 కోచ్లు ఉండేలా ఉక్కుతో తయారై 220 KM రన్నింగ్ సామర్థ్యంతో గరిష్ఠంగా 250 KMPH వేగం కలిగి ఉండాలని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం వందే భారత్ 160 KMPH వేగంతో నడవగలవు.
Similar News
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్కూటత్తిల్పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
News November 28, 2025
ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.


