News November 30, 2024
తొక్కుకుంటూ పాలమూరుకు నిధులు తెస్తా: రేవంత్

TG: పాలమూరు జిల్లాపై BRS నేతలు మొసలి కన్నీరు కారుస్తూ, కపట ప్రేమ చూపిస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ‘నేను ఇక్కడ పుట్టినోడ్ని. పోతే ఈ మట్టిలో కలిసేటోడ్ని. CMగా ఉండి నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామవాడను తెచ్చి 25వేల ఉద్యోగాలు ఇప్పిస్తా’ అని వెల్లడించారు.
Similar News
News November 24, 2025
పేరుపాలెం బీచ్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

పేరుపాలెం బీచ్ లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఒక యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఏలూరు కొత్తపేటకు చెందిన మునగాల మోహన్ సాయి గణేశ్ (19) మిత్రులతో కలిసి అలల్లో స్నానం చేస్తూ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అధికారులు నిన్నటి నుంచి గాలిస్తుండగా సోమవారం మోళ్లపర్రులో బీచ్లో లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.


