News July 1, 2024
తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

* హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
* కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
* భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
* ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
* గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
* భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
* ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
* వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి
Similar News
News January 6, 2026
విజయ్కు కొత్త చిక్కులు

తమిళ స్టార్ హీరో విజయ్కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. మరోవైపు టీవీకే పార్టీ మీటింగ్ ర్యాలీలో <<18778497>>తొక్కిసలాట<<>> ఘటన కేసు CBIకి చేరింది. దీనిపై ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.
News January 6, 2026
ఇతిహాసాలు క్విజ్ – 119 సమాధానం

ప్రశ్న: రామాయణంలో ఏ 2 విష్ణు అవతారాలు పరస్పరం ఎదురుపడ్డాయి? ఆ సందర్భం ఏంటి?
జవాబు: రామాయణంలో రాముడు, పరశురాముడు ఎదురుపడతారు. సీతాకళ్యాణం ముగించుకుని అయోధ్యకు వెళ్లేటప్పుడు శివధనుస్సు విరిచిన రాముడిని ఎదుర్కునేందుకు పరశురాముడు వస్తాడు. రాముడిలోని దైవాన్ని గుర్తించి తన అవతార సమాప్తిని ప్రకటించి తపస్సుకి వెళ్లిపోతాడు. ఇది ఒకేసారి 2 విష్ణు అవతారాలు కలిసిన అరుదైన సందర్భం. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 6, 2026
కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.


