News May 15, 2024
తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

AP: ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రబలగాలు సైతం పహారా కాస్తున్నాయి.
Similar News
News February 8, 2026
కీలక కేసుల ఎవిడెన్స్ సురక్షితమే: ఫోరెన్సిక్ డైరెక్టర్

TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ <<19076008>>అగ్నిప్రమాదం<<>>పై డైరెక్టర్ శిఖా గోయెల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఉద్యోగుల అప్రమత్తతతో ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా కేసులకు సంబంధించి ప్రాపర్టీ, FSLకు చెందిన సామాగ్రి సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. ఘటనకు కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని, తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
News February 8, 2026
భారత్తో ఘర్షణ వేళ చైనా ‘అణు’ కుట్ర? US సంచలన రిపోర్ట్!

2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత సైనికులతో ఘర్షణ జరిగిన సరిగ్గా వారం తర్వాత చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని US సంచలన ఆరోపణలు చేసింది. ప్రపంచం కొవిడ్తో పోరాడుతున్న వేళ చైనా Decoupling టెక్నిక్ వాడి భూకంప సంకేతాలు బయటకు రాకుండా ఈ పరీక్షను దాచిపెట్టిందని UN వేదికగా అమెరికా వెల్లడించింది. Lop Nur ప్రాంతంలో వందల టన్నుల సామర్థ్యంతో ఈ పేలుడు జరిగినట్లు US ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
News February 8, 2026
రాత్రిపూట ఈ ఒక్క అలవాటు మార్చుకోండి.. మీ గుండె సేఫ్!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు నిద్రపోయామనే దానికంటే ఏ టైమ్కి పడుకున్నామన్నదే చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. ‘స్లీప్ అడ్వాన్సెస్’ జర్నల్లో వచ్చిన స్టడీ ప్రకారం.. రోజూ ఒకే టైమ్కు నిద్రపోయే అలవాటు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 15రోజులు రెగ్యులర్గా ఒకే టైమ్కి పడుకుంటే BP తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ చిన్న మార్పుతో హైపర్ టెన్షన్ సమస్యకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.


