News January 31, 2025

అప్పటి లోపు టీచర్ల బదిలీ పూర్తి: మంత్రి లోకేశ్

image

AP: మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా టీచర్ల బదిలీ పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉమ్మడి AP, నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేసింది మేమే. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వ నిర్ణయాల్లో టీచర్ల అభిప్రాయాలుంటాయి. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం వారి సమస్యలు వింటున్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెస్తున్నాం’ అని చెప్పారు.

Similar News

News December 3, 2025

వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మల్లికార్జున

image

చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన ఎన్.మల్లికార్జున‌ను వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించినట్లు సంఘం వ్యవస్థాపకుడు పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘానికి, మద్దతు తెలిపిన వాల్మీకులకు మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి–బోయ వర్గాల అభివృద్ధి, ఎస్‌టీ సాధన కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.

News December 3, 2025

PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

image

⋆HYD​ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం​ నిర్మాణానికి, మన్ననూర్​-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్​ కారిడార్‌కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం​ పోర్ట్ 12 లేన్ల​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, HYD-BLR గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి చొరవ చూపాలి

News December 3, 2025

ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

image

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.