News September 4, 2025

పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగులు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం IASల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. సర్వే సెటిల్‌మెంట్స్‌&ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా R.కూర్మనాథ్‌, తూ.గో. జాయింట్‌ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్, గుంటూరు JCగా A.శ్రీవాస్తవ, మన్యం JCగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అల్లూరి(D) పాడేరు ITDA POగా తిరుమాని శ్రీపూజ, AP విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరీగా కె.ఆర్‌.కల్పశ్రీ, విశాఖ(D) రంపచోడవరం ITDA POగా స్మరణ్‌రాజ్‌‌లను నియమించింది.

Similar News

News September 5, 2025

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ గణపతి హోమం

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.
*File photo

News September 5, 2025

అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

image

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <>crda.ap.gov.in<<>>లోకి వెళ్లి 4 ఆప్షన్లలో మీకు నచ్చిన దానికి ఓటు వేయొచ్చు. ఈ వంతెన అమరావతి-హైదరాబాద్ హైవేను కలపనుంది. ఇప్పటికే వెస్ట్ బైపాస్‌లో భాగంగా ఒక వంతెన పూర్తయింది.

News September 5, 2025

RCB ఎఫెక్ట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే..

image

RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్‌లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.