News March 19, 2025
ట్రాన్స్జెండర్ హత్య.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న CM

AP: అనకాపల్లి(D)లో జరిగిన ట్రాన్స్జెండర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను CM చంద్రబాబు ఆదేశించారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బయ్యవరం కల్వర్టు వద్ద దుప్పటిలో చుట్టిన మృతదేహం కనిపించగా, పోలీసులు విచారణ చేపట్టారు. దీపు అనే ట్రాన్స్జెండర్ను చంపి శరీరాన్ని ముక్కలు చేసినట్లు గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు. దీపు కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


