News June 5, 2024
డిపాజిట్లు కోల్పోయిన ట్రాన్స్జెండర్లు!

లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు ట్రాన్స్జెండర్లూ డిపాజిట్లు కోల్పోయారు. ధన్బాద్ నుంచి పోటీ చేసిన సునైనా కిన్నార్ అనే స్వతంత్ర అభ్యర్థికి 3,462 ఓట్లు వచ్చాయి. దక్షిణ ఢిల్లీ నుంచి బరిలో నిలిచిన రాజన్ సింగ్కు కేవలం 325 ఓట్లే పోలయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్లో దామో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దుర్గా మౌసికి 1,124 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 12, 2025
గ్రామ పంచాయతీలకు శుభవార్త

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.
News November 12, 2025
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


