News August 15, 2025
ట్రెండింగ్: #BoycottIndependenceDay

దేశంలో మగవాళ్లకు రక్షణ లేకుండా పోతోందని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Xలో #BoycottIndependenceDayAug15 అనే హాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుత చట్టాలు ఆడవాళ్లవైపే ఉన్నాయని, వాటిని మార్చాల్సిన సమయం వచ్చిందంటున్నారు. భార్య మోసం చేసినా, విడాకులు తీసుకున్నా తామెందుకు పరిహారం చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భర్తలను చంపుతున్న ఘటనలూ పెరుగుతున్నాయంటున్నారు. మీ COMMENT.
Similar News
News August 15, 2025
APP ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 118 పోస్టులను భర్తీ చేయనుంది. వేతనాలు, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలు అధికారిక <
News August 15, 2025
బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు!

బొప్పాయిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘అందులోని పొటాషియం రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయులను మెరుగుపరుస్తుంది. విటమిన్ A, Eలు చర్మ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. శరీరంలోని మలినాలను బయటికి పంపే ఔషధ గుణాలూ బొప్పాయి సొంతం. ఉదయం దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు దరిచేరవు. అధిక ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది’ అని వివరిస్తున్నారు.
News August 15, 2025
సరదా సన్నివేశం: ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’

AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభోత్సవంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో వెళ్లారు. ‘విజయవాడకు మూడు టికెట్లు ఇవ్వండి’ అని పవన్ కండక్టర్ను అడిగారు. అక్కడే ఉన్న లోకేశ్ ‘పవనన్నా! డబ్బులు నేనిస్తా’ అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.