News April 6, 2025
ట్రెండింగ్లో #GetOutModi

కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు Xలో ‘గెట్ ఔట్ మోదీ’ హ్యాష్ట్యాగ్తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్తో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని రుద్దాలని చూస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. నార్త్, సౌత్ స్టేట్స్ మధ్య నిధుల కేటాయింపులో తేడాలపై ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి PM వెళ్తున్న నేపథ్యంలో #GetOutModi ట్రెండవుతోంది.
Similar News
News April 12, 2025
రేపే రిజల్ట్స్.. ఆత్మహత్యలు వద్దు సోదరా!

సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT
News April 12, 2025
ధోనీపై తమిళ హీరో అసహనం

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.
News April 12, 2025
PHOTOS: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.