News April 23, 2025
ట్రెండింగ్: #WeWantRevenge

J&K పహల్గామ్లో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #WeWantRevenge ట్రెండింగ్ చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని చంపేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి భూమిపై జీవించే హక్కు లేదని పేర్కొంటున్నారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు

AP: జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 81.14% ఉత్తీర్ణత

AP: పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా (47.64%) చివరిస్థానంలో నిలిచాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యధిక ఉత్తీర్ణత శాతం (95.02%) సాధించాయి.
News April 23, 2025
BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT