News October 8, 2025

హైకోర్టులో తిరిగి ప్రారంభమైన విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. రిజర్వేషన్ల అమలు జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లకు నంబరింగ్ ఇవ్వలేదని మరో న్యాయవాది విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ, న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News March 21, 2026

భర్తకు తీవ్ర అనారోగ్యం.. శ్మశానంలో వదిలివెళ్లిన భార్య!

image

TG: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్‌ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించారు.

News March 21, 2026

జెన్యూన్ హీరోలు లేరు: తాప్సీ

image

కథకు ప్రాధాన్యమిచ్చి, తమ పాత్ర పరిధి ఎంత ఉన్నా నటించే జెన్యూన్ హీరోలు ప్రస్తుతం లేరని నటి తాప్సీ అన్నారు. ‘హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉంటే నటించేందుకు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదు. హీరోయిన్ హైలైట్ అయితే తమ ఇమేజ్ దెబ్బతింటుందనేది వారి భావన. ఇలా అయితే మంచి కథలు ఎలా వస్తాయి. కథానాయికలు పాటలకే పరిమితం కావాలనే పాతకాలపు ఆలోచన నుంచి బయటికి రావాలి’ అని పిలుపునిచ్చారు.

News March 21, 2026

భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

image

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.