News September 11, 2024

అటవీ అమరవీరులకు నివాళులు: పవన్

image

AP: అటవీ సంపదను పరిరక్షించడంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘APలో 37,421 చ.కి.మీ అమూల్యమైన అటవీ సంపదను రక్షించడంలో మన సిబ్బంది ముందంజలో ఉన్నారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. వారికి నివాళులర్పిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

Similar News

News August 24, 2025

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టత రానుంది. BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని సమాచారం. కాగా ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక, న్యాయ సలహా మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనుంది.

News August 24, 2025

తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్‌కు సపోర్ట్ చేసిన అజర్‌బైజాన్‌లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్‌తో పోలిస్తే 60% తగ్గింది.

News August 24, 2025

ఎల్లుండి నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్‌పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.