News March 21, 2024

‘విశ్వంభర’తో త్రిష

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వ‌స్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవి, ఎంఎం కీరవాణిల‌తో త్రిష ఫొటో దిగారు. దానిని ట్వీట్ చేసిన ఆమె ‘లెజెండ‌రీల‌తో దివ్య‌మైన ఉద‌యం’ అని క్యాప్షన్ ఇచ్చారు.

Similar News

News October 6, 2024

ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. దసరా కంటే ముందే వీటికి భూమిపూజ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే 600కు పైగా పాఠశాలలకు సొంత భవనాలు లేవని భట్టి తెలిపారు.

News October 6, 2024

విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?

image

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్‌లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్‌తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.

News October 6, 2024

మాది పొయ్యి వెలిగించే హిందూత్వ.. బీజేపీదేమో: శివసేన UBT

image

తమ హిందూత్వ ఇంట్లో పొయ్యి వెలిగిస్తే BJP హిందూత్వ ఏకంగా ఇంటికే నిప్పు పెడుతుందని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అందుకే శివసేనను ఫినిష్ చేయాలనుకున్నారని ఆరోపించారు. మరో నెలలోనే మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ద్రోహులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేసిన తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.