News January 5, 2025

త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘త్రివిక్రమ్‌పై చాలాకాలం కిందట MAAలో ఫిర్యాదుచేశా. అయినా అతడిని ప్రశ్నించలేదు.. చర్యలు తీసుకోలేదు. నా ఆరోగ్యం, సంతోషాన్ని నాశనం చేసిన అతడిని పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త్రివిక్రమ్ తనతోపాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని ఆమె పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

Similar News

News November 8, 2025

వీధికుక్కల సంరక్షణపై అధికారుల తర్జన భర్జన

image

వీధికుక్కల కేసులో <<18231321>>SC<<>> ప్రభుత్వాలకు నిన్న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. వీటి అమలుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వనరుల లేమితో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. స్కూళ్లు, బస్, రైల్వే స్టేషన్లలోకి కుక్కలు రాకుండా ఫెన్సింగ్, NHపైకి మూగజీవాలు రాకుండా ఏర్పాట్లు ఎలా చేయాలోనని మథనపడుతున్నారు. కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని SC ఆదేశించింది. అమలుపై అఫిడవిట్లూ వేయాలని, లేకుంటే చర్యలుంటాయని హెచ్చరించింది.

News November 8, 2025

ధ్రువ్ జురెల్ మరో సెంచరీ

image

సౌతాఫ్రికా-Aతో జరుగుతోన్న రెండో అన్‌అఫీషియల్ టెస్టులో ఇండియా-A బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132* రన్స్ చేసిన ఆయన, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో IND-A 255, SA-A 221 స్కోర్ చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ స్కోర్ 355-6గా ఉంది. జురెల్ (117*), పంత్ (48*) క్రీజులో ఉన్నారు.

News November 8, 2025

48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

image

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.