News February 20, 2025
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న త్రివిక్రమ్ కుమారుడు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, యాక్టింగ్ వైపు కాకుండా తండ్రి బాటలోనే డైరెక్టర్గా మారేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దగ్గర శిక్షణ తీసుకుంటుండగా త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్లో జాయిన్ అవుతారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 21, 2025
ట్రెండింగ్లో ‘బాయ్కాట్ ఓయో’

ఎక్స్లో ‘బాయ్కాట్ ఓయో’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఓ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో ‘దేవుడు అన్ని చోట్లా ఉంటాడు.. అలాగే ఓయో కూడా’ అని పేర్కొనడమే ఇందుకు కారణం. దేవుడితో పోల్చడమేంటని ఓయో యాజమాన్యంపై నెటిజన్లు, హిందూ సంఘాల ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు. ఓయోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన కస్టడీ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీ, హెల్త్ పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
News February 21, 2025
టెస్లా కారు రూ.21 లక్షలకు వస్తే మన కంపెనీలకు దెబ్బే.. కానీ!

ఇండియాలో టెస్లా కార్లు రాబోతున్నాయని, వాటి ధర రూ.21 లక్షలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ కంపెనీలో రూ.21 లక్షల ప్రైస్ రేంజ్లో కారే లేదు. మినిమమ్ ధర రూ.34 లక్షలుగా ఉంది. పన్నులతో రూ.40 లక్షల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ రూ.21 లక్షల్లో తీసుకొస్తే దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్రా ఈవీ మార్కెట్లకు పెద్ద దెబ్బే పడనుంది. రూ.40 లక్షలు, ఆపై ఉంటే లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది. పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.