News June 4, 2024
Troll: ముద్రగడ పద్మనాభం కాదు.. ముద్రగడ పద్మనాభ రెడ్డి

కాపు ఉద్యమ నేత ముద్రగడ <<13375442>>పద్మనాభం<<>> పేరును మార్చే నూతన నామకరణ మహోత్సవానికి కాపు యువత సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీలోని కిర్లంపూడిలో ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆహ్వాన పత్రికను నటుడు బ్రహ్మాజీ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వాలని కోరారు.
Similar News
News October 27, 2025
గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్

ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ రెడ్డి అనే మినియేచర్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే అతిచిన్న చెక్క స్పూన్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ స్పూన్ పొడవు 1.13mm. సూది కన్నులోంచి వెళ్లగలిగేంత చిన్నగా ఉంటుంది. దీనిని రూపొందించేందుకు 3 నెలల సమయం పట్టిందని, మైక్రోస్కోప్తో చూస్తేనే ఇది కనిపిస్తుందని బిజయ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు బిహార్కు చెందిన వ్యక్తి(1.64mm) పేరిట ఉండేది.
News October 27, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
News October 27, 2025
అధికంగా తిని పూజలు చేయవచ్చా?

అధికంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికే కాక, ఆధ్యాత్మిక పురోగతికి కూడా అడ్డంకి. మితిమీరిన ఆహారం వలన ఆయువు క్షీణించి, స్వర్గసుఖములు దూరమవుతాయి. ఇది మనస్సును అశాంతపరుస్తుంది. అంతేకాక ఇతరుల దృష్టిలో తిండిపోతుగా నిందలకు గురికావాల్సి వస్తుంది. అందుకే దేవుడిచ్చిన పవిత్ర జీవితాన్ని, దైవ చింతనలో ఉండాలనుకునేవారు అధికంగా ఆహారాన్ని స్వీకరించకూడదు. మితాహారమే భక్తి మార్గంలో మనసును స్థిరంగా ఉంచుతుంది. <<-se>>#Aaharam<<>>


