News May 5, 2024

పార్థివ్ పటేల్‌పై నెట్టింట ట్రోలింగ్

image

మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ చేసిన తాజా వ్యాఖ్యలు నెట్టింట ఆయనపై ట్రోలింగ్‌కు దారి తీశాయి. నిన్న రాత్రి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే మ్యాక్స్‌వెల్ అత్యంత ఓవర్‌రేటెడ్ ఆటగాడు అంటూ పార్థివ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. పలువురు ఆర్సీబీ, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఆయన హైట్‌ను హేళన చేస్తూ ట్రోల్ చేశారు.

Similar News

News January 24, 2026

అభిషేక్‌ కెరీర్‌లో తొలి గోల్డెన్ డక్

image

భారత యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డక్ నమోదు చేసుకున్నారు. NZతో జరుగుతున్న రెండో T20లో తొలి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. జాకబ్‌ డఫీ వేసిన బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్‌ ఇచ్చారు. ఇది అభిషేక్‌కు T20Iల్లో రెండో డక్‌. 2024లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (డెబ్యూ) తొలిసారి డకౌట్ అయ్యారు. మొత్తంగా ఐపీఎల్‌తో కలిపి టీ20ల్లో 10 సార్లు 0 పరుగులకే వెనుదిరిగారు.

News January 24, 2026

LRS దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్‌కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.

News January 23, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్‌లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.