News October 9, 2025
TRP ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్గా నవీన్ కుమార్

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్లను నియమిస్తూ పార్టీ ప్రధాన నాయకత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో MBNR సోషల్ మీడియా కన్వీనర్గా నవీన్ కుమార్ నియమితులయ్యారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు చేరవేయడంలో కన్వీనర్ల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
TODAY HEADLINES

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్పై సౌతాఫ్రికా విజయం
News October 10, 2025
IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.
News October 10, 2025
పటాన్చెరు LIGలో పేలుడు

పటాన్చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.