News December 30, 2024
నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి

ఇథియోపియాలోని సిదామా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో ట్రక్కు పడిన ఘటనలో 71 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో యువకులు ఎక్కువగా ఉన్నట్లు, వారు ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News November 25, 2025
రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీల విజేత తూ.గో జిల్లా

రాష్ట్రస్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల హాకీ పోటీల్లో తూ.గో జిల్లా జట్టు విజయదుందుభి మోగించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోటీల్లో ఈస్ట్ గోదావరి జట్టు క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచారు. నక్కపల్లి హాకీ గ్రౌండ్లో జరిగిన బాలికల హాకీ ఫైనల్ పోటీలలో తొలి రోజు నుంచి ఆ జట్టు తిరుగులేని ఆదిత్యతను కనబరుస్తూ కప్పు చేజిక్కించుకుంది. ఆ జట్టుకు షీల్డ్ అందజేశారు.
News November 25, 2025
పార్వతీపురంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం వన్ స్టాప్ సెంటర్ ఆవరణలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలన్నారు. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


