News October 15, 2024

ఆధారాలు ఇవ్వకుండా ఆరోపణలేంటి ట్రూడో!

image

రాజకీయ లబ్ధి కోసం కెనడా PM జస్టిన్ ట్రూడో నీచ స్థాయికి దిగజారారని విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్థానీలు సహా తమ పౌరుల్ని హతమార్చేందుకు భారత దౌత్యవేత్తలు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారన్న ఆయన ఆరోపణల్ని కొట్టిపారేశారు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకేసు ఆధారాలను భారత్‌కు ఇంకా ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడూ ఎవిడెన్స్‌లు ఇవ్వకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. >>comment

Similar News

News January 12, 2026

అగ్నివీర్ వాయు దరఖాస్తులు షురూ

image

ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు నియామకాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించేందుకు యువతకు అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 1వ తేదీ 11PM వరకు అప్లై చేసుకునేందుకు గడువుంది. 2006 జనవరి 1-2009 జులై 1 మధ్య పుట్టిన, ఇంటర్/12వ తరగతిలో 50% మార్కులు సాధించిన అవివాహితులు అర్హులు. మరిన్ని వివరాలకు iafrecruitment.edcil.co.in.లో సంప్రదించవచ్చు.

News January 12, 2026

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

image

AP: జగన్‌ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్‌ అవుతుందా? జగన్‌ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.

News January 12, 2026

Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

image

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్‌పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.