News August 12, 2025
చైనాపై టారిఫ్స్.. మళ్లీ వెనక్కి తగ్గిన ట్రంప్

చైనాపై టారిఫ్స్ సస్పెన్షన్ను ట్రంప్ మరో 90 రోజులకు పొడిగించారు. ఇరు దేశాలు పరస్పర ప్రతీకార సుంకాలను నవంబర్ 10 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. టారిఫ్స్ సస్పెన్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఇప్పుడే సంతకం చేశానని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాగా భారత్పై 50% సుంకాలు విధించిన ట్రంప్ రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న చైనాపై మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.
Similar News
News August 12, 2025
అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్!

అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత బిలియనీర్ ముకేశ్ అంబానీని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీని పేల్చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఖురాన్లోని ఓ వాక్యాన్ని ఉదహరిస్తూ అంబానీ ఫొటో చూపిస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా మునీర్ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ <<17370414>>కౌంటర్<<>> ఇచ్చింది.
News August 12, 2025
అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.
News August 12, 2025
బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసు

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్కి BRS నేత KTR లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత CM, మాజీ సీఎం KCR కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను KTR ట్యాప్ చేయించారంటూ సంజయ్ ఆరోపించారని నోటీస్లో మెన్షన్ చేశారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.