News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్ -చైనా ఏకమవ్వాలి: చైనా

image

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

Similar News

News April 17, 2025

అమానుషం.. బధిర బాలికపై సామూహిక అత్యాచారం?

image

UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.

News April 17, 2025

YCP హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు: కూటమి నేతలు

image

AP: ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కూటమి నేతలు విమర్శించారు. తాము గోశాల వద్దకు వచ్చామని, భూమనతో సహా ఇతర వైసీపీ నేతలెవరూ ఇక్కడికి రాలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

News April 17, 2025

బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్‌ హవా.. సీక్వెల్ ప్రకటన!

image

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘జాట్’తో ప్రేక్షకులను మెప్పించారు. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ APR 10న విడుదలై ఇప్పటివరకు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ‘జాట్-2’ను ప్రకటించింది. ఈ మూవీనీ గోపీచందే తెరకెక్కించనున్నారు. అటు సన్నీడియోల్ దీనితో పాటు బోర్డర్-2, గదర్-3 లోనూ నటిస్తున్నారు.

error: Content is protected !!