News April 9, 2025
చైనాకు ట్రంప్ భారీ షాక్.. చెప్పినట్లే భారీ సుంకాలు

చైనా తమపై విధించిన ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ దేశంపై టారిఫ్స్ను 104శాతానికి పెంచుతానన్న ట్రంప్, అదే చేశారు. తన హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చైనాపై అదనంగా 50శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంపై అమెరికా మొత్తం టారిఫ్లు 104శాతానికి చేరాయి. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందోనని ఆర్థిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News November 6, 2025
ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.


