News February 23, 2025

ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

image

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.

Similar News

News February 23, 2025

మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

image

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

News February 23, 2025

అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ

image

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని PM మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్&సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. క్యాన్సర్‌తో పోరాడేందుకు బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేశామని, మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

error: Content is protected !!