News August 7, 2025
ట్రంప్ టారిఫ్స్.. భారత్పైనే అత్యధికం!

మిత్ర దేశం అంటూనే భారత్పై ట్రంప్ టారిఫ్స్ యుద్ధం ప్రకటించారు. <<17326848>>ఇష్టారీతిన<<>> సుంకాల(50%)తో విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తులోనూ ఇంకా పెంచుతానని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్(50%), భారత్ మాత్రమే అత్యధిక టారిఫ్స్ ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్(39%), కెనడా(35%), చైనా(30%) ఉన్నాయి. ట్రంప్ చర్యలతో US, భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News August 7, 2025
రూ.18 లక్షల జీతంతో ఉద్యోగాలు.. పెళ్లి కానివారు అర్హులు

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ 379 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీటెక్ పూర్తైన లేదా చివరి ఏడాది చదువుతున్న 20-27 ఏళ్లలోపు పెళ్లికాని వారు అర్హులు. ఎంపికైతే ట్రైనింగ్లో ₹56,100 స్టైఫండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని ఏడాదికి రూ.18 లక్షలు(నెలకు ₹1.5లక్షలు) జీతం ఇస్తారు. పదేళ్లు విధుల్లో ఉండొచ్చు. అవసరమైతే పొడిగిస్తారు. లేదంటే తప్పుకోవాలి. AUG 22 చివరి తేదీ. వివరాలకు <
News August 7, 2025
ఎంపీ గోల్డ్ చైన్ పోతే 2 రోజుల్లో.. మరి మన పరిస్థితి?

తమిళనాడు ఎంపీ సుధ <<17298166>>గోల్డ్ చైన్<<>>ను దొంగిలించిన వారిని 2 రోజుల్లోనే పట్టుకున్న పోలీసులు.. సామాన్యుల ఫిర్యాదులపై అంత వేగంగా ఎందుకు స్పందించరని చర్చ జరుగుతోంది. 2014లో యూపీ మంత్రి అజామ్ ఖాన్ ఫామ్హౌస్లో ఏడు గేదెలు చోరీకి గురైతే 24 గంటల్లో వాటి జాడ కనుక్కున్నారని గుర్తు చేస్తున్నారు. అదే సామాన్యులు జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము చోరీ అయితే పోలీసులు ఇదే విధంగా స్పందిస్తారా? COMMENT.
News August 7, 2025
మరోసారి USకు పాక్ ఆర్మీ చీఫ్.. దేనికి సంకేతం?

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి USలో పర్యటించనున్నారు. భారత్తో సీజ్ఫైర్ తర్వాత ట్రంప్తో మునీర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నెలాఖర్లో US ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ మిచెల్ కురిల్లా రిటైర్ కాబోతున్నారు. ఆమె ఫేర్వెల్ వేడుకకు ఆసిమ్ హాజరుకానున్నారు. ఇప్పటికే పాక్తో ఆయిల్ డీల్ కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఒకపక్క ట్రేడ్ వార్, మరోపక్క పాక్-US సంబంధాలు బలపడటం INDకు ఆందోళన కలిగించే అంశమే.