News November 7, 2024
ట్రంప్ విజయం.. మస్క్కు ₹2.2లక్షల కోట్లు లాభం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.
Similar News
News January 26, 2026
NZB: 15,63,113 మందికి లబ్ధి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,41,023 ఆహార భద్రత కార్డుల ద్వారా 15,63,113 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం 2026 జనవరి నెలలో 9024.451 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని కేటాయించగా అందులో 8573.227 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందని పౌర సరఫరాల శాఖ ప్రగతిని కలెక్టర్ వివరించారు.
News January 26, 2026
BJPకి రాజీనామా.. మళ్లీ BRSలోకి మాజీ MLA

TG: వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ BJP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నుంచి రమేశ్ 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో BRS తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 మార్చిలో BJPలో చేరారు. తాజాగా BRS ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
News January 26, 2026
నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్భవన్లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్బాబు, ఉత్తమ్, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.


