News April 29, 2024
TS EAPCET: విద్యార్థులకు కీలక సూచనలు

టీఎస్ <<13145492>>ఈఏపీసెట్<<>> పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. చేతులకు గోరింటాకు, టాటూలు వంటివి పెట్టుకోవద్దని సూచించారు. 90min ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, కనీసం 20min ముందు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో వేరే పరీక్ష రాయాల్సి ఉంటే ముందుగానే విజ్ఞప్తి చేసుకోవాలని, వారికి మరో రోజున పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News January 5, 2026
గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.
News January 5, 2026
ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 5, 2026
ఐకానిక్ వంతెనకు టెండర్లు.. తగ్గనున్న 90kmల దూరం

ఏపీ-తెలంగాణను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానిస్తోంది. 1077 మీటర్ల పొడవైన హైబ్రిడ్ వంతెనను EPC విధానంలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.816.10 కోట్లు కాగా, 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా వెళ్లాల్సి ఉండగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 90kmల దూరం తగ్గనుంది.


