News April 10, 2024
TS EAPCET: సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు!
TS EAPCETకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు మే 1 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,49,247 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తుండడంతో JNTU అధికారులు కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెంటర్లను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News October 10, 2024
TATA: పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం..!
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి మరో బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన చిన్నప్పుడే తండ్రి నావల్ టాటా నుంచి తల్లి సోనో విడిపోయారు. తన నానమ్మ నవాజ్ బాయ్ వద్దే ఆయన పెరిగారు. కొంతకాలానికి ఆయన తల్లి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై టాటాను స్కూళ్లో తోటి విద్యార్థులు అవహేళన చేసేవారు. ఆ అవమానాలే ఆయన వివాహం చేసుకునేందుకు అడ్డు వచ్చాయని అంటారు.
News October 10, 2024
నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!
దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లా లాహర్ నగర్లో రతన్గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.
News October 10, 2024
రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.