News September 20, 2025
TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.
Similar News
News September 20, 2025
దీపిక పోస్ట్.. ‘కల్కి’ని ఉద్దేశించేనా?

‘కల్కి’ నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకొణే ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ‘ఓంశాంతి ఓం’ సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తుచేసుకున్నారు. ‘ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికీ అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో’ అని రాసుకొచ్చారు.
News September 20, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. అటు హైదరాబాద్లో రాత్రి సమయంలో వర్షం పడుతుందని పేర్కొన్నారు.
News September 20, 2025
గ్రామాల్లో వృద్ధులపైనే వ్యవసాయ భారం

వ్యవసాయానికి గ్రామాలే వెన్నెముక. ఇక్కడ పండే పంటలే మిగిలిన ప్రాంతాలకు ఆధారం. నేటి యువత వ్యవసాయాన్ని విస్మరించి, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో నేడు వ్యవసాయం, పశుపోషణాభారం వృద్ధులపైనే పడుతోంది. ప్రస్తుతం గ్రామాల్లోని వృద్ధులు.. రైతులుగా, పశుపోషకులుగా, వ్యవసాయ కూలీలుగా, కుటుంబ సంరక్షులుగా, అనేక ఉత్పాదక పనులు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.