News January 17, 2025
చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD

AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News February 10, 2026
భారత బ్యాటర్లపై సంచలన ఆరోపణలు

భారత క్రికెటర్లపై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. ఇతర జట్లు వాడే బ్యాట్ల కంటే IND క్రికెటర్ల బ్యాట్లు ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయన్నారు. ‘మాకు దొరికే బెస్ట్ బ్యాట్స్ కంటే IND ప్లేయర్ల బ్యాట్లు చాలా మెరుగైనవి. వాటిపై ఒక రబ్బర్ లేయర్ ఉంటుంది. ఇదెలా సాధ్యమో నాకు తెలియదు. వేరే వారికి ఈ బ్యాట్లు దొరకవు. ఆటగాళ్లందరికీ ఈ విషయం తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
News February 10, 2026
11 నంబర్ చూసి భయపడి దాక్కుంటావా: అచ్చెన్న

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు YCP చీఫ్ జగన్కు ఛాలెంజ్ విసిరారు. ‘నాడు ప్రజలు ఇచ్చింది 11 సీట్లు, రేపు అసెంబ్లీ మొదలయ్యేది 11వ తేదీ! ఆ నంబర్ చూసి భయపడి ఇంట్లో దాక్కుంటావా.. లేక పులివెందుల ఎమ్మెల్యేగా దమ్ముంటే అసెంబ్లీకి వస్తావా?’ అని ట్వీట్ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
News February 10, 2026
ఉలవ పంటలో కాయ ఈగ – నివారణకు సూచనలు

ఉలవ పంటను ఆశించే కాయ ఈగ అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. అందుకే కాయ లోపల జరిగే నష్టం మనకు కనిపించదు. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 50% ఇ.సి 2ML లేక థయోమిథాక్సామ్ 25% W.G 0.4గ్రా కలిపి పిచికారీ చేయాలి.


