News January 17, 2025
చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD

AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News February 5, 2026
టీచర్ పోస్టులు.. 1.17లక్షల్లో 296 మందే పాస్!

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.
News February 5, 2026
వాషింగ్టన్ పోస్ట్ నిర్ణయం ఆత్మహత్య లాంటిదే: శశిథరూర్

తన కొడుకు ఇషాన్ను వాషింగ్టన్ పోస్ట్ <<19054288>>తొలగించడంపై<<>> కాంగ్రెస్ MP శశిథరూర్ ఫైరయ్యారు. ‘వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంలో వింత ఏంటంటే.. ఇషాన్ కాలమ్ ప్రాచుర్యం పొందింది. ఆయన WorldViewకు 5లక్షల ఫాలోవర్లు ఉన్నారు. విదేశీ మంత్రులు, రాయబారులు చదువుతారు. ఈ ఫాలోయింగ్ను ధనార్జనకు వాడుకోవచ్చు. కానీ కాలమ్ను తీసేయడం ఆత్మహత్యలా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.
News February 5, 2026
పరుచూరి ‘వ్యక్తిత్వ వికాస’ మంత్రం ఇదే!

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


