News September 21, 2024
లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర భేటీ

AP: లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. ఆలయం సంప్రోక్షణతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 5, 2026
బూతుపాట వివాదం.. సినీ హీరోపై కేసు నమోదు

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్పై HYD మాదాపూర్ పీఎస్లో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా, చంద్రహాస్ ఆయన్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 5, 2026
రేపు ఆర్బీఐ రెపో రేటు ప్రకటన

RBI రేపు ప్రకటించనున్న రెపో రేటు కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన MPC భేటీ (మానిటరీ పాలసీ కమిటీ) శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించనుంది. GDP వృద్ధి రేటు జోరు మీద ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. రెపో రేటు తగ్గితే సామాన్యుడికి లాభం కలుగుతుంది. ఇల్లు, వాహనం, పర్సనల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.
News February 5, 2026
AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.


