News September 22, 2024
పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో భేటీ
AP: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.
Similar News
News September 22, 2024
సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. హాజరైన అరికెపూడి
TG: పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం మొదలైంది. మాదాపూర్లోని హోటల్లో జరగుతున్న ఈ భేటీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్లోనే ఉన్నట్లు ప్రకటించిన అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
News September 22, 2024
చరిత్ర సృష్టించనున్న ‘స్త్రీ 2’!
బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ కలెక్షన్లపరంగా చరిత్ర సృష్టించనుంది. ఈరోజు గడిస్తే హిందీలో రూ.600 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా నిలవనుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. చివరిగా బాహుబలి-2 హిందీలో రూ.500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ‘స్త్రీ’కి కొనసాగింపుగా వచ్చిన ‘స్త్రీ2’ దాన్ని దాటేసింది. విడుదలై 6 వారాలైనా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
News September 22, 2024
పరీక్షల ముందు కంగారు పడవద్దు
పరీక్షల సందర్భంగా విద్యార్థులు చదివింది కంగారులో మర్చిపోకుండా ఉండేందుకు ప్రిపరేషన్ మూడ్ నుంచి ఎగ్జామ్ మూడ్లోకి మారాలి. స్కోరింగ్ టాపిక్స్పై అధికంగా దృష్టిసారించాలి. విభిన్న కోణాల్లో ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, లాజికల్గా సమాధానాలు ఇచ్చేందుకు లాంగ్ ఫార్మాట్లో రాయడం ప్రాక్టీస్ చేయాలి. సోషల్ మీడియాపై ధ్యాస తగ్గించి తగిన విశ్రాంతి తీసుకొనేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.