News February 28, 2025

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పెయింటింగ్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లడ్డూల బఫర్ స్టాక్, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.

Similar News

News October 16, 2025

భారత్‌పై WTOకి చైనా ఫిర్యాదు

image

ఇండియా అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్, EV బ్యాటరీ సబ్సిడీలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇది దేశీయ తయారీదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని, చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. తమ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు, హక్కుల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని వారి వాణిజ్య శాఖ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే IND అధిక సబ్సిడీలు అందిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.

News October 16, 2025

గ్రీన్ క్రాకర్స్ సురక్షితమేనా?

image

పొల్యూషన్ తగ్గించేందుకు వాడే <<18010671>>గ్రీన్ క్రాకర్స్‌<<>> కూడా పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే పొగ, శబ్దం తక్కువ చేసినప్పటికీ వీటి నుంచి వెలువడే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరే ప్రమాదముందని చెబుతున్నారు. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

News October 16, 2025

రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

image

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.