News January 27, 2025

TTD Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 15, 2025

బాలికకు 100 సిట్ అప్స్ శిక్ష.. మృతి

image

నిన్న బాలల దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని వాసాయిలో దారుణం జరిగింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని కాజల్ అనే ఆరోతరగతి చిన్నారికి టీచర్ 100 సిట్ అప్స్ పనిష్మెంట్ విధించింది. అవన్నీ పూర్తి చేసిన బాలిక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. ఇంటికి చేరుకోగానే ఆరోగ్యం క్షీణించింది. పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

గత 6ఏళ్లలో FDIల సాధనలో AP వెనుకబాటు

image

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ సాధనలో 2019 OCT-2025 JUN మధ్య కాలంలో AP బాగా వెనుకబడింది. ఆ కాలంలో $1.27B FDIలతో ఏపీ 14వ స్థానానికి పరిమితమైంది. దేశ FDIలలో ఏపీ వాటా 0.2%-0.7% కాగా కర్ణాటక 14%-28% TN 3.7%-10% దక్కించుకున్నట్లు బిజినెస్ టుడే పేర్కొంది. 2025 జూన్‌ క్వార్టర్లో AP $307 M, కర్ణాటక $10 B, TG $2.3 B FDIలు సాధించాయి. కాగా VSP CII సమ్మిట్‌లో వచ్చిన 13L CR పెట్టుబడుల్లో FDIలూ ఉన్నాయి.

News November 15, 2025

Where is my Train యాప్ సృష్టికర్త ఇతడే!

image

ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్‌లలోనే గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం. కానీ ‘Where is my Train’ యాప్ వచ్చాక లైవ్ స్టేటస్‌ను తెలుసుకోగలుగుతున్నాం. ‘సిగ్మాయిడ్ ల్యాబ్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను 2018లో గూగుల్ కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మొహైదీన్ తన టీమ్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ ₹320 కోట్లు దాటింది. మీరూ ఈ యాప్ వాడతారా?