News September 21, 2024
లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం

AP: లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.
Similar News
News January 19, 2026
రైతుభరోసా డబ్బులు ఎప్పుడు.. రైతుల ఎదురుచూపులు

TG: యాసంగి సీజన్ ‘రైతుభరోసా’ కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తారని వార్తలు వచ్చినా ఎలాంటి ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం శాటిలైట్ సర్వే ద్వారా పంట భూములను గుర్తిస్తోంది. అది పూర్తయ్యాక ఎకరానికి రూ.6వేల చొప్పున ఖాతాల్లో వేయనుంది. అది ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై సర్కారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. FEB లేదా మార్చిలో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News January 19, 2026
డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
News January 19, 2026
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని<


