News September 21, 2024
లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం

AP: లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.
Similar News
News October 20, 2025
దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.
News October 20, 2025
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.