News March 5, 2025

TU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. మొత్తం విద్యార్థులు 19574 మంది పరీక్షలకు హాజరుకాగా 6436 మంది (32.88%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 14.58% కాగా బాలికలు 42.83% ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News December 16, 2025

బాలయ్య నోట మరో పాట.. సాహోరే బాహుబలి తరహాలో!

image

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కోసం మరోసారి సింగర్‌గా మారబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. కాగా బాలయ్య గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే సాంగ్ పాడారు. అప్పుడప్పుడూ మూవీ ఈవెంట్లలోనూ ఆయన తన సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తుంటారు.

News December 16, 2025

రామగుండం: ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమల్లో BNSS’

image

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని 9 మండలాల్లో 5 మందికిపైగా గుమిగూడద్దన్నారు. చట్టబద్ధమైన సమావేశం కోసం ముందస్తు అనుమతి తప్పనిసరని అన్నారు. ఈ ఉత్తర్వులు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు కొనసాగుతాయన్నారు.

News December 16, 2025

నల్గొండ: అభ్యర్థి చనిపోవడంతో ఓట్ల డబ్బును తిరిగిచ్చిన గ్రామస్థులు

image

మునుగోడు మండలం కిష్టాపురంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చెనగోని కాటంరాజు బీఆర్‌ఎస్‌ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల సందర్భంగా అతను ఓట్ల కోసం పంచిన డబ్బులను ఎస్సీ కాలనీ ఓటర్లు తిరిగి తన కొడుకు వంశీకి అందజేశారు. 11న జరిగిన ఎన్నికల్లో కాటంరాజు 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నగదును తిరిగి ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.