News March 5, 2025
TU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డిచ్పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. మొత్తం విద్యార్థులు 19574 మంది పరీక్షలకు హాజరుకాగా 6436 మంది (32.88%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 14.58% కాగా బాలికలు 42.83% ఉత్తీర్ణులయ్యారు.
Similar News
News November 12, 2025
చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

భారత్ విషయంలో చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. జనరిక్ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత నెలలో నిర్వహించిన టెండర్లో సిప్లా, నాట్కో, హెటిరో, రెడ్డీస్ వంటి ఫార్మా సంస్థలు చైనా ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ‘డపాగ్లిఫ్లోజిన్’ అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను సప్లై చేయనున్నాయి. ఇతర టాబ్లెట్లూ సరఫరా చేయనున్నాయి.
News November 12, 2025
నేడు కర్నూలుకు గవర్నర్ రాక

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
News November 12, 2025
నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.


