News March 5, 2025

TU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. మొత్తం విద్యార్థులు 19574 మంది పరీక్షలకు హాజరుకాగా 6436 మంది (32.88%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 14.58% కాగా బాలికలు 42.83% ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News October 20, 2025

ఖమ్మం: విద్యార్థి మృతి.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన

image

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి జస్వంత్ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొదుమూరులోని ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే తమ బిడ్డ మృతి చెందాడన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

News October 20, 2025

మీ చిన్ననాటి దీపావళి గుర్తుందా?

image

దీపావళి అనుభూతుల పండుగ. ఉదయం తొందరగా లేచి కొత్త బట్టలు, తీపి వాసనలతో నిండిన ఇంటి వాతావరణం, స్నేహితులతో టపాకులు పేలుస్తూ సందడి. అయితే ఇప్పుడు ఫోన్లు, షార్ట్ వీడియోలు దీపావళిని ఆక్రమించాయి. టెక్నాలజీ యుగంలో బాణాసంచాల కన్నా బిజీ లైఫ్, సెల్ఫీ ఫిల్టర్లే ఎక్కువ. మరి మీ నాటి దీపావళి జ్ఞాపకాలు గుర్తున్నాయా? టపాకాయాల కోసం ఇంట్లో మారాం చేశారా? కామెంట్ చేయండి..

News October 20, 2025

తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

image

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.