News December 10, 2025

TU: డిగ్రీ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని డిగ్రీ-సీబీసీఎస్- I, III ,V సెమిస్టర్ (రెగ్యులర్), II, IV, VI సెమిస్టర్ (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం 18వ రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 83 మంది విద్యార్థులకు 72 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News December 11, 2025

NZB: కొనసాగుతున్న కౌంటింగ్.. వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

image

మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1642 వార్డులకు గురువారం జరిగిన పోలింగ్ అనంతరం నిర్వహించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ తరపున 51, BRS నుండి ఏడుగురు, BJP నుంచి ఆరుగురు, ఇతరులు 5గురు సర్పంచ్ లుగా విజయం సాధించారు.

News December 11, 2025

బోధన్: అత్తపై కోడలు ఘన విజయం

image

బోధన్ మండలం లంగ్డాపూర్‌లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త బెల్లిడీగ గంగామణి పై కోడలు బెల్లిడీగ శోభారాణి ఘన విజయం సాధించింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగగా శోభారాణి 232 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 424 ఓట్లు ఉండగా గంగామణికి 93 ఓట్లు, శోభారాణికి 325 ఓట్లు పోలయ్యాయి.

News December 11, 2025

NZB: తుది పోలింగ్ 81.37 శాతంగా నమోదు

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో తుది పోలింగ్ 81.37 శాతంగా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.93%, చందూరు-79.55%, కోటగిరి-78.21%, మోస్రా-82.48%, పొతంగల్- 82.30%, రెంజల్- 83.72%, రుద్రూరు-83.85%, సాలూర-86.45%, వర్ని-80.83%, ఎడపల్లి-79.92%, నవీపేట-76.95% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.