News October 15, 2025

TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఎడ్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న ఎంఎడ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. బుధవారం జరిగిన పరీక్షలో 100 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News October 15, 2025

NZB: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు: కలెక్టర్

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.

News October 15, 2025

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి మాట్లాడారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

News October 15, 2025

‘జాతీయ రహదారి 167(ఏ) నిర్మాణం పూర్తి చేయాలి’

image

వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారి 167 (ఏ) నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం చెప్పారు. 47 కిలో మీటర్ల పొడవునా నిర్మించే రహదారి బాపట్ల జిల్లాలోనే 35 కిలోమీటర్ల పొడవున వెళ్తుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, తదితరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటివరకు 92.38% రహదారి నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు.