News March 17, 2024
తూ.గో: ఎలక్షన్@2024.. 4 చోట్ల సిట్టింగులకు నో ఛాన్స్!

వైసీపీ MLA అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి తూ.గో జిల్లాలో నలుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
☞ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యామ్నాయంగా తోట నరసింహం,
☞ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు కాకుండా వంగా గీత,
☞ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్కు ప్రత్యామ్నాయంగా వరుపుల సుబ్బారావు,
☞ పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కనబెట్టి విప్పర్తికి టికెట్లు ఇచ్చారు.
Similar News
News March 29, 2025
తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.
News March 28, 2025
అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.
News March 28, 2025
కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.