News March 16, 2024

తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

image

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.

Similar News

News January 31, 2026

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రహదారి భద్రత నియమాలను క్రమశిక్షణతో పాటించడం సామాజిక బాధ్యత అని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, రహదారి నిర్వహణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణాల్లో నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు.

News January 30, 2026

రాజమండ్రి: 60 ఏళ్ల తర్వాత రూ.3,000 పెన్షన్..!

image

అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం అందించాలనే లక్ష్యంతో PM-SYM – PM-LVM ద్వారా జాతీయ పెన్షన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా సహాయ కార్మిక కమీషనర్ B.S.M వలి శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 పెన్షన్ పొందవచ్చన్నారు. ఆసక్తి గలవారు కార్మిక శాఖ కార్యాలయం, మీ-సేవా కేంద్రంలో సంప్రదించాలన్నారు.

News January 30, 2026

తూ.గో: రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగుతోంది. గురువారం రాత్రి డీఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కతేలని రూ.1,82,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ లక్ష్మిపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో, గత రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.