News March 16, 2024
తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
Similar News
News January 25, 2026
BREAKING.. రుడా పరిధిలో భూముల విలువ పెంపు

రుడా పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజమండ్రిలో ఆదివారం కలెక్టర్ మేఘ స్వరూప్ దీనిపై సమావేశం నిర్వహించారు. పెంపుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 లోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలపాలని కోరారు. పెరిగిన ధరలు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయన్నారు.
News January 25, 2026
రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
News January 25, 2026
తూ.గో: 12.5 టన్నుల గంజాయి దహనం

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో గత నాలుగేళ్లుగా సీజ్ చేసిన 12,570 కేజీల గంజాయిని శనివారం నిర్వీర్యం చేశారు. కాపుల ఉప్పాడలోని జిందాల్ ప్లాంట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. చట్టప్రకారం ప్రణాళికాబద్ధంగా, పర్యావరణానికి హాని కలగకుండా గంజాయిని దహనం చేశామని, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.


