News March 16, 2024
తూ.గో.: ‘చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం’

కాపునేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీరాములు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కులద్రోహిగా.. చరిత్ర హీనుడిగా ముద్రగడ పద్మనాభం మిగిలిపోతారని దుయ్యబట్టారు. ఏ షరతు లేకుండా వైసీపీ కండువా కప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ఎదుగుదల కోరుకునే వారు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.
Similar News
News March 30, 2026
వాహనాల వేలం ద్వారా రూ.10.06 లక్షల ఆదాయం: ఆర్టీఓ

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు, ఫిట్నెస్ లేని 36 వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.10,06,600 ఆదాయం సమకూరినట్లు జిల్లా రవాణా అధికారి (ఆర్టీఓ) ఆర్.సురేశ్ తెలిపారు. పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో వివిధ కేటగిరీల వాహనాలను వేలం వేశామన్నారు. యజమానులు సకాలంలో పన్నులు చెల్లించి పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
News March 30, 2026
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక

ఐపీఎల్ మ్యాచ్ల సాకుతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు తెలపాలని కోరారు. నిర్వాహకులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.
News March 29, 2026
రాజమండ్రి: ‘జనగణన డేటా సేకరణ పకడ్బందీగా చేపట్టాలి’

2027 గృహ జనగణన డేటా సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని డీఆర్ఓ సీతారామ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్ఎంసీ సమావేశ మందిరంలో 2027 గృహ జనగణన డేటా సేకరణకు సంబంధించి నియమితులైన ఫీల్డ్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గృహ, జనగణన డేటా సేకరణలో క్షేత్ర శిక్షకులు ప్రధాన పాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.


