News July 20, 2024

TUDA ఛైర్మన్‌గా చైతన్య ఆదికేశవులు..?

image

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్‌గా చైతన్య ఆదికేశవులు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ ఓటమితో మోహిత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

image

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.

News November 8, 2025

చిత్తూరు: జర్నలిజం పేరుతో వేధింపులు తగదు

image

జర్నలిజం పేరుతో అధికారులను వేధించడం తగదని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇద్దరు పాత్రికేయులు మహిళా ఉద్యోగులను బెదిరించిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిని విచారించి ఒకరి అక్రిడేషన్ రద్దు చేశామన్నారు.

News November 8, 2025

కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన

image

కుప్పం నియోజకవర్గంలో ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి శనివారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2200 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏడు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని అన్నారు. దీనికి సంబంధించి శనివారం అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.