News February 28, 2025
SEBI చీఫ్గా తుహిన్ కాంత పాండే

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Similar News
News November 17, 2025
చలి తీవ్రత.. 10 జిల్లాలకు అలర్ట్!

TG: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్(D) సిర్పూర్లో 7.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే 3రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ADB, వికారాబాద్, MDK, నిర్మల్, BPL, మంచిర్యాల, WGL, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో టెంపరేచర్లు 7-11 డిగ్రీల మధ్య నమోదవుతాయని చెప్పింది.
News November 17, 2025
బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు: మంచు లక్ష్మి

తనకు 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేనెప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. హాల్ టికెట్ల కోసం ఓసారి స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకడంతో షాకయ్యాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటారు కానీ బయటకు చెప్పుకోలేరు’ అని తెలిపారు.
News November 17, 2025
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.


