News April 29, 2024

తుని రైలు దహనం వైసీపీ కుట్రే: పవన్

image

AP: 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక YCP కుట్ర ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘YCP నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కాపు యువతను ఎగదోశారు. కిరాయిమూకలతో తునిలో రైలు తగలబెట్టారు. ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారు. నేను ఆవేశంతో మాట్లాడతాను. విధ్వంసం వైపు వెళ్లను. ఏ ఉద్యమమైనా సరిగా చేయకపోతే అమాయకులు బలవుతారు. ఇదే నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News November 12, 2025

పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

image

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

News November 12, 2025

నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

image

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి

News November 12, 2025

పాక్ కోర్టు ఆవరణలో దాడి మా పనే: జమాత్ ఉల్ అహ్రార్

image

పాకిస్థాన్‌లోని కోర్టు ఆవరణలో <<18258453>>పేలుడు<<>> తమ పనేనని నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ షరియా అమలులోకి వచ్చే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ సంస్థ గతంలో TTP అనుబంధ సంస్థగా ఉంది.