News February 22, 2025
టన్నెల్ ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ <<15542453>>టన్నెల్ ప్రమాదంపై<<>> సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే అక్కడికెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
Similar News
News October 15, 2025
రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

TG: కామారెడ్డి(D) భిక్కనూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తాత, తల్లి, పిల్లలను కబళించింది. ఖమ్మం(D) ముస్తికుంటకు చెందిన వీరు స్కూటీపై వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. తల్లి, ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తాత, రెండేళ్ల పాపను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
News October 15, 2025
సౌతాఫ్రికాపై పాక్ విజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ ఇన్సింగ్సులో పాక్ 378 పరుగులు చేయగా సౌతాఫ్రికా 269 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో పాక్ 167 రన్స్కే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా పాక్ బౌలర్ల ధాటికి 183 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ నొమన్ అలీ 10 వికెట్లతో సత్తా చాటారు. SA బౌలర్ సెనురన్ ముత్తుసామి 11 వికెట్లు తీశారు.
News October 15, 2025
ఐడియా అదిరింది కానీ.. సాధ్యమేనా!

దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్లో కేజీ వెండి రూ.1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ.2,07,000 ఉంది. అంటే ఏకంగా రూ.17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ రూ.14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.